కోల్కతా: తమ రాష్ర్టానికి నిధుల విడుదలలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరిపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మరోసారి మండిపడ్డారు. అభివృద్ధి పనులు కొనసాగించడానికి కావాల్సిన నిధుల కోసం అవసరమైతే ప్రజల వద్దనైనా బిచ్చమెత్తుతా కానీ.. కేంద్రం ముందు దేహీ అనే ప్రసక్తే లేదని ఆమె స్పష్టం చేశారు.
కోల్కతాలో జరిగిన అడిటోరియం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆమె ప్రసంగిస్తూ ‘వచ్చే ఏడాది వరకు కేంద్రం నుంచి ఎలాంటి నిధులు రావని విన్నా. కేంద్రాన్ని పదేపదే యాచించను. పరిమిత నిధులతోనే అపరిమితమైన అభివృద్ధిని సాధించాం’ అని ఆమె పేర్కొన్నారు.