Kamal Haasan | పార్టీ రాజకీయాలను పక్కనపెట్టి దేశం గురించి ఆలోచించాల్సిన తరుణం ఇదని ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం (Makkal Needhi Maiam) అధినేత కమల్ హాసన్ (Kamal Haasan) అన్నారు. బుధవారం మీడియాతో ఆయన మాట్లాడారు. దేశం గురించి నిస్వార్థంగా ఆలోచించేవారెవరైనా సరే తమ పార్టీలో భాగమవ్వొచ్చని పేర్కొన్నారు. స్థానిక రాజకీయాలు చేసే వారితో తాము భాగం కాలేమని ఈ సందర్భంగా కమల్ హాసన్ స్పష్టం చేశారు.
సమావేశంలో భాగంగా ‘ఇండియా’ (INDIA) కూటమిలో చేరుతున్నారా..? అని కమల్ హాసన్ను మీడియా ప్రశ్నించింది. దీనికి ఆయన ‘లేదు.. నేను చేరట్లేదు’ అని సమాధానం ఇచ్చారు. అదే సమయంలో వచ్చే లోక్సభ ఎన్నికల్లో రాజకీయ పొత్తుపై ప్రశ్నించగా.. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని సమాధానం ఇచ్చారు.
లోక్సభ ఎన్నికలకు (Lok Sabha polls) ముందు తమిళనాడు రాష్ట్రంలో కమల్ పార్టీతో అధికార డీఎంకే (DMK) పొత్తు ఉంటుందని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ అంశంపై ఇటీవలే కమల్ హాసన్ మాట్లాడుతూ.. పొత్తుపై రెండు రోజుల్లో ప్రకటన వెలువడుతుందని చెప్పారు. ఈ నేపథ్యంలోనే పొత్తుపై ఇవాళ మీడియా ప్రశ్నించగా.. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని సమాధానం ఇచ్చారు. ఈ విషయంలో ఏదైనా శుభవార్త తెలిస్తే మీడియాకు తప్పకుండా చెప్తామని తెలిపారు.
#WATCH | Chennai, Tamil Nadu | Actor and Makkal Needhi Maiam chief Kamal Hassan says, “I have already told that this is the time when you have to blur party politics and think about the nation. Anybody who thinks selflessly about the nation, my Makkal Needhi Maiam will be a part… pic.twitter.com/B9XfBmRvck
— ANI (@ANI) February 21, 2024
Also Read..
Gujarat | గుజరాత్లో ఒకే తరగతి గదితో నడుస్తున్న 341 ప్రభుత్వ పాఠశాలలు..!
Ameen Sayani | దిగ్గజ రేడియో ప్రెజెంటర్ అమీన్ సయానీ కన్నుమూత
Virat Kohli | భారత్ హాయిగా నిద్రపోతుంది.. విరుష్క జంటకు వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపిన ఆర్సీబీ