జోగులాంబ గద్వాల : కర్ణాటక నుంచి అక్రమంగా వరి ధాన్యం తీసుకువచ్చి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా అదనపు కలెక్టర్ రఘురామ శర్మ హెచ్చరించారు. గురువారం కేటీ దొడ్డి మండలం ఇర్కిచెడు గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రఘురామ శర్మ తనిఖీ చేశారు.
అనంతరం నందిన్నె చెక్ పోస్ట్ ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కర్ణాటక నుంచి అక్రమంగా తెలంగాణకు తరలిస్తున్న ధాన్యం లారీని (ఏపీ 03 x 1519) సీజ్ చేశారు.
డ్రైవర్ సమీర్ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేయాలని ఎస్ఐని ఆదేశించారు. లారీలో 300 క్వింటాళ్ల ధాన్యం బస్తాలు ఉన్నట్లు అదనపు కలెక్టర్ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
మైనర్ వివాహాన్ని అడ్డుకున్న పోలీసులు
అంబులెన్స్లోనే కరోనా గర్భిణి ప్రసవం
సీఎం కేసీఆర్ వెంటే మంథని ప్రజలు
అజిత్ సింగ్ మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం
కరోనా కష్టకాలంలో రైతులను ఆదుకుంటున్న ప్రభుత్వం