Elephant Attack | చెన్నై : ఓ దేవాలయం వద్ద నిద్రిస్తున్న 60 ఏండ్ల వృద్ధుడిని అడవి ఏనుగు తొక్కి చంపింది. ఈ ఘటన తమిళనాడులోని కోయంబత్తూర్లో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. తిరుప్పూర్ జిల్లా వాడవేదంపట్టి గ్రామానికి చెందిన జీ షణ్ముగసుందరం గతేడాది నుంచి మంగళపాలయం తూర్పు అటవీ సరిహద్దుల్లో ఉన్న ఓ టెంపుల్ పరిసరాల్లో ఉంటున్నాడు. మంగళవారం రాత్రి ఆలయం వద్దకు చేరుకున్న అడవి ఏనుగు బీభత్సం సృష్టించింది. షణ్ముగసుందరంపై దాడి చేసింది. అతన్ని తొక్కి చంపింది.
సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. అడవి ఏనుగు సమీప అడవుల్లో నుంచి జనావాసాల్లోకి ఏనుగు ప్రవేశించినట్లు అధికారులు నిర్ధారించారు. షణ్ముగం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోయంబత్తూర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు.