ఇప్పుడు నెట్టింట్లో ఓ ఫొటో తెగ వైరల్ అవుతోంది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఈ ఘట్టం తర్వాత స్పీకర్ ఓం బిర్లా పార్లమెంటరీ పార్టీ నేతలతో తన గదిలో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి స్పీకర్ ఓంబిర్లా, ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్, ఇతర కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా, ములాయం సింగ్, ఫరూక్ అబ్దుల్లాతో పాటు వివిధ పార్లమెంటరీ పార్టీ నేతలు హాజరయ్యారు. ఈ ఫొటోలను లోక్సభ స్పీకర్ ఓంబిర్లా తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. లోక్సభ వాయిదా పడిన తర్వాత పార్లమెంటరీ పార్టీ నేతలతో సమావేశమయ్యా.సభా గౌరవాన్ని పెంచే విధంగా మరిన్ని చర్చల స్థాయిని పెంచాల్సిన అవసరం ఉందని కోరాను. దీనికి సమిష్టి కృషి అవసరమని చెప్పాను. ఈ ప్రయత్నానికి అన్ని పార్టీలూ చురుగ్గా సహకరిస్తాయని నేను నమ్ముతున్నాను అంటూ స్పీకర్ పేర్కొన్నారు.
After Lok Sabha was adjourned sine die, I urged Hon'ble leaders of parties that collective efforts in raising level of discussions&dialogue further is necessary in order to enhance dignity of House. It's my sincere hope that all parties will actively co-operate in this endeavour. pic.twitter.com/zCtPDEmaLs
— Lok Sabha Speaker (@loksabhaspeaker) April 7, 2022