కోల్కతా : ది కేరళ స్టోరీ ( the kerala story) మూవీని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సోమవారం నిషేధించింది. రాష్ట్రంలో శాంతిభద్రతల పర్యవేక్షణ, విద్వేష నేరాలు, హింస ప్రజ్వరిల్లకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. మే 5న కేరళ స్టోరీ విడుదలవగా సినిమాపై సర్వత్రా హాట్ డిబేట్ సాగుతోంది. తమిళనాడులోనూ ఈ మూవీ స్క్రీనింగ్ను రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసింది.
మోదీ సర్కార్పై దీదీ ఫైర్
మణిపూర్లో హింసాకాండపై నరేంద్ర మోదీ సర్కార్ లక్ష్యంగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ విమర్శలు గుప్పించారు. బెంగాల్లో ఏం జరిగినా తమ ప్రతిష్టను దెబ్బతీసేందుకు వందలాది కేంద్ర బలగాలను ఇక్కడకు పంపేవారని, మణిపూర్ బీజేపీ పాలిత రాష్ట్రం కావడంతో అలాంటిదేమీ జరగడం లేదని దీదీ అన్నారు. అయితే ప్రజలు వాస్తవాలు తెలుసుకోవాలని కోరుకుంటున్నారని ఆమె పేర్కొన్నారు.
మణిపూర్ అల్లర్లలో, కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులతో ఎంత మంది మరణించారనే వివరాలు ప్రజలకు తెలియడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. గతవారం మణిపూర్లో మీతై వర్గం, గిరిజనుల మధ్య జరిగిన ఘర్షణలు హింసాత్మకంగా మారడం విచారకరమని అన్నారు. తాము మణిపూర్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామని మమతా బెనర్జీ చెప్పారు. హింసతో అట్టుడుకుతున్న మణిపూర్లో చిక్కుకున్న బెంగాలీల కోసం రాష్ట్ర ప్రభుత్వం హెల్ప్లైన్ ఏర్పాటు చేసింది. మణిపూర్లో ఉన్న బెంగాలీలను రాష్ట్రానికి రప్పించే ప్రక్రియను పర్యవేక్షించాలని మమతా బెనర్జీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు.
Read More
Manipur | మణిపూర్ నుంచి హైదరాబాద్కు చేరుకున్న తెలుగు విద్యార్థులు