న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతాబెనర్జి ఈ నెల 7న ఢిల్లీలో తన పార్టీ ఎంపీలతో సమావేశం కానున్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల నేపథ్యంలో మమత తృణమూల్ ఎంపీలతో భేటీ కానుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.
పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా ఉభయసభల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహం, లేవనెత్తాల్సిన అంశాలు తదితర విషయాలపై మమతాబెనర్జి ఎంపీలతో చర్చించే అవకాశం ఉన్నది. కేంద్రం నుంచి బెంగాల్కు రావాల్సిన నిధులు, బెంగాల్పై కేంద్రం వివక్ష తదితర అంశాలను పార్లమెంట్లో బలంగా వినిపించాలని మమత తన ఎంపీలకు సూచించనున్నారు.