మాల్దా, జనవరి 31: పశ్చిమబెంగాల్కు కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలను గురువారం నాటికి విడుదల చేయాలని.. లేనిపక్షంలో శుక్రవారం నుంచి స్వయంగా తానే ధర్నాకు దిగుతానని ఆ రాష్ట్ర సీఎం మమతాబెనర్జీ హెచ్చరించారు.
బుధవారం ఆమె ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్కు ఒక్క లోక్సభ సీటు కూడా కేటాయించబోనని, ఆ పార్టీ సీపీఎంతో జతకట్టి బీజేపీకి లబ్ధిచేకూరుస్తున్నదని విమర్శించారు.