కోల్కతా: ఈవీఎంలను హ్యాకింగ్ చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. ఇందుకు సంబంధించి ఆధారాలు ఉన్నాయని గురువారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్డీయే సర్కార్కు నైతిక విలువలు లేవని, ఈవీఎంలను హ్యాకింగ్ చేసి 2024 ఎన్నికల్లో గెలిచేందుకు ప్రణాళికలు రచిస్తున్నదని ఆమె ఆరోపించారు.
విపత్తులు, హింసాత్మక ఘటనలు, నిరుద్యోగం నుంచి దేశాన్ని కాపాడుకోవాలని, రాబోయే ఎన్నికల్లో మోదీ సర్కార్కు ఓటమి తప్పదని వ్యాఖ్యలు చేశారు.