కోల్కతా: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన 2026-27 బడ్జెట్ వల్ల సామాన్యుడికి ఒరిగేదేమీ లేదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. ఇది దశ, దిశ, దార్శనికత లేని బడ్జెట్ అని మండిపడ్డారు. పశ్చిమ బెంగాల్కు ఈ బడ్జెట్లో ఏమీ ఇవ్వలేదన్నారు.
ఈ బడ్జెట్లో కీలక రంగాలకు కేటాయింపులను తగ్గించారన్నారు. ఇది ప్రజలు, మహిళలు, రైతులు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు వ్యతిరేక బడ్జెట్ అని చెప్పారు.