Mamata Banerjee | పురూలియా: బీజేపీలో చేరతారా లేక చర్యలు తీసుకోవాలా అని కేంద్ర దర్యాప్తు సంస్థలు తమ పార్టీ నేతలను బెదిరిస్తున్నాయని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. ఆదివారం పురూలియా జిల్లాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ‘టీఎంసీ నాయకులను వేధించడానికి ఎన్ఐఏ, ఈడీ, సీబీఐలను ఉపయోగిస్తున్నారు. అర్ధరాత్రి ఎవరైనా ఇంట్లోకి చొరబడితే ఇంట్లోని మహిళ ఏం చేస్తుంది?’ అని ఆమె ప్రశ్నించారు. భూపతినగర్లో ఎన్ఐఏ అధికారులపై జరిగిన దాడిని ఇందుకు ఉదాహరణగా ఆమె అభివర్ణించారు.