Mamata Banerjee | ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు (Ramoji Rao) మృతి పట్ల పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు రామోజీరావుతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు పెట్టారు.
‘ఈనాడు గ్రూప్, ఈటీవీ నెట్వర్క్, ఫిల్మ్ సిటీ వ్యవస్థాపకులు రామోజీరావు మరణవార్త దిగ్భ్రాంతికి గురిచేసింది. కమ్యూనికేషన్ ప్రపంచానికి ప్రత్యేకంగా తెలుగు మీడియాకు ఆయన దార్శనికుడు. ఆయన గురించి నాకు బాగా తెలుసు. మంచి పరిచయం ఉంది. ఓసారి ఫిల్మ్సిటీకి నన్ను ఆహ్వానించారు. ఫిల్మ్సిటీ సందర్శన మధురానుభూతి నాకు ఇంకా గుర్తుంది. ఆ జ్ఞాపకాలను ఎప్పటికీ మర్చిపోలేను. ఆయన కుటుంబ సభ్యులు, శ్రేయోభులాషులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’ అని దీదీ పోస్ట్ పెట్టారు.
Saddened to know about the demise of media leader Ramoji Rao. Founder head of the Eenadu group, ETV network and a large film city, he was a torchbearer of specifically Telugu and generally the entire regional cultural-communication world.
I knew him well, and have personal…
— Mamata Banerjee (@MamataOfficial) June 8, 2024
Also Read..
Ramoji Rao | రామోజీ మృతితో మీడియా, వినోద రంగం ఓ టైటాన్ను కోల్పోయింది : రాష్ట్రపతి ముర్ము
Ramoji Rao | రామోజీ రావు మృతిపట్ల సూపర్ స్టార్ రజినీకాంత్ సంతాపం
Ramoji Rao | రామోజీరావు పార్థివదేహానికి నివాళులర్పించిన సినీ, రాజకీయ ప్రముఖులు