కోల్కతా, ఏప్రిల్ 30: బీజేపీ నాయకత్వంపై తీవ్ర విమర్శలు చేసిన ఆ పార్టీ ఎంపీ, పశ్చిమబెంగాల్ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అర్జున్ సింగ్.. మరోసారి విరుచుకుపడ్డారు. శనివారం ఆ రాష్ట్ర సీఎం మమతాబెనర్జీకి లేఖ రాసిన ఆయన.. రైతులను ఆదుకోవాలని కోరారు.
జనపనార అంశంలో మోదీ సర్కారు విధానాలు అట్టర్ఫ్లాప్ అని, ఫలితంగా జనపనార పరిశ్రమ తీవ్ర ఇబ్బందులు పడుతున్నదని పేర్కొన్నారు. మద్దతు ధర విషయంలో మమత జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మమతకు రాసిన లేఖను అర్జున్ సింగ్ ట్వీట్ చేశారు.