చెన్నై: దేశవ్యాప్తంగా హిందీని బలవంతంగా రుద్దేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై తమిళనాడు సీఎం,ఎంకే స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమోదం కొంత నెమ్మదిగా ఉన్నప్పటికీ, చివరకు వ్యతిరేకత లేకుండా హిందీని అంగీకరించాల్సిందేనంటూ హోం మంత్రి అమిత్షా శుక్రవారం పార్లమెంటరీ కమిటీ సమావేశంలో వ్యాఖ్యలు చేశారని వచ్చిన వార్తలపై ఆయన శనివారం స్పందించారు.
తమిళనాడు ప్రజలు హిందీకి బానిసలు కాబోరని స్టాలిన్ స్పష్టం చేశారు. హిందీ అధిపత్యం, బలవంతంగా రుద్దే ప్రయత్నాలను తమిళనాడు కచ్చితంగా వ్యతిరేకిస్తుందని పేర్కొన్నారు. తమ భాష, వారసత్వం తమను నిర్వచిస్తుందని, హిందీకి బానిసలు కాబోమని స్టాలిన్ పేర్కొన్నారు.