అహ్మాదాబాద్: గుజరాత్లోని గాంధీనగర్లో అంతర్జాతీయ అంతరిక్ష సమావేశం జరుగుతోంది. ఆ సమావేశంలో ఇవాళ ఇస్రో చీఫ్(ISRO Chairman) ఎస్ సోమనాథ్ మాట్లాడారు. 2035లో అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించాలని, ఆ కేంద్రానికి భారతీయులు వెళ్లాలని, అక్కడ పరిశోధనలు జరగాలని ఆయన అన్నారు. తన ప్రసంగంలో ఆయన ప్రధాని మోదీని కొనియాడారు. అంతరిక్ష పరిశోధనలపై ప్రధాని మోదీ ఫోకస్ పెట్టారని, ఆయన సీఎంగా ఉన్న సమయంలోనూ ఆ విజన్ పనిచేశారన్నారు. అంతరిక్షంలో మానవుల నిరంతరం సంచారం ఉండాలని ప్రధాని పేర్కొన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. భారతీయ అంతరిక్ష సంస్థ గగన్యాన్ ప్రోగ్రామ్ను చేపడుతోందని, చంద్రుడిపై ఇండియన్ను దించడమే లక్ష్యమని, 2040 నాటికి చంద్రుడిపై భారతీయు వ్యోమగామి ఉంటాడని భావిస్తున్నట్లు ఇస్రో చీఫ్ వెల్లడించారు. నిజానికి ఆ లక్ష్యం చాలా దూరమే అయినా.. అది చాలా దగ్గరే అని, దీని కోసం మనం 2035లోగా స్పేస్ స్టేషన్ను నిర్మించాలని, అక్కడికి ఇండియన్స్ వెళ్లి పరిశోధనలు చేయాలని సోమనాథ్ తెలిపారు.
#WATCH | Gujarat: ISRO Chairman S Somanath addresses International Space Conference 2024 in Gandhinagar.
He says, “Let me look at the type of vision that the Prime Minister has given after this success story of the last 6 months. I think he also has been an ardent supporter of… pic.twitter.com/PNX0MKMYH1
— ANI (@ANI) January 11, 2024