Arjun Munda : లోక్సభ నాలుగో విడత నామినేషన్లకు మరో రెండు రోజులు మాత్రమే గడువు మిగిలి ఉండటంతో అభ్యర్థులు పోటీపడి నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ఏప్రిల్ 18న మొదలైన నాలుగో విడత నామినేషన్లు ఏప్రిల్ 25న ముగియనున్నాయి. జార్ఖండ్లోని కుంతి లోక్సభ స్థానానికి కూడా నాలుగో విడతలోనే పోలింగ్ జరగనుంది.
దాంతో కుంతి లోక్సభ స్థానానికి ఇవాళ కేంద్రమంత్రి అర్జున్ ముండా నామినేషన్ వేశారు. బీజేపీ అభ్యర్థిగా ఆయన నామినేషన్ దాఖలు చేశారు. స్థానిక నేతలు, అనుచరులతో కలిసి ఎన్నికల రిటర్నింగ్ కార్యాలయానికి చేరుకున్న ఆయన.. ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను సమర్పించారు.
#WATCH | Jharkhand: Union Minister and BJP candidate from Khunti, Arjun Munda files his nomination for #LokSabhaElections2024 pic.twitter.com/l84fuQq0qk
— ANI (@ANI) April 23, 2024
నామినేషన్ దాఖలుకు ముందు అర్జున్ ముండా అమ్రేశ్వర్ ధామ్ ఆలయానికి వెళ్లారు. అక్కడ పరమ శివుడి ముందు తన నామినేషన్ పత్రాలను ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత ఆలయ అర్చకుల నుంచి ఆశీర్వాదం తీసుకున్నారు. అక్కడి నుంచి నేరుగా ఎన్నికల రిటర్నింగ్ ఆఫీస్కు వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు.
#WATCH | Jharkhand: Ahead of filing his nomination as BJP candidate from Khunti, Union Minister Arjun Munda offered prayers at Aamreshwar Dham Temple near Khunti.#LokSabhaElections2024 pic.twitter.com/rJfmbH9NOD
— ANI (@ANI) April 23, 2024