ముంబై: మహారాష్ట్ర (Maharastra) రైతులు (Farmers) తమ సమస్యల పరిష్కారం కోసం కదం తొక్కారు. నాసిక్ నుంచి ముంబై వరకు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. సీపీఎం ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో వేలాది మంది రైతులు పాల్గొన్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం డిమాండ్ చేస్తూ , ప్లకార్డులు ప్రదర్శిస్తూ రైతులు ముందుకు కదిలారు.
ఈ ర్యాలీలో ఎక్కడ చూసినా ఎర్ర జెండాలు, ఎర్ర టోపీలు, ఎర్ర కండువాలే దర్శనమిచ్చాయి. రాష్ట్రంలో రైతులు అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నామని, ఆ సమస్యలన్నింటి పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారించేలా చేయడం కోసమే తాము ఈ ర్యాలీ చేపట్టామని రైతు సంఘాల నాయకులు తెలిపారు. వేలమంది రైతులు చీమల్లా బారులుతీరి తరలివెళ్తున్న ఈ ర్యాలీ దృశ్యాలను మీరు కూడా ఒకసారి వీక్షించండి.
#WATCH | Thousands of Maharashtra farmers march towards Mumbai from Nashik to draw the government’s attention towards the various problems faced by them pic.twitter.com/BO1sXYjVSL
— ANI (@ANI) March 14, 2023