సీఎం రేవంత్రెడ్డి ట్విట్టర్లో పోస్ట్ చేసిన ఫేక్ డాక్యుమెంట్లో ఓయూ చీఫ్ వార్డెన్ స్టాంప్ను కూడా మార్చేశారు. తప్పు చేసింది రేవంత్ అయితే, బీఆర్ఎస్ నాయకుడు క్రిశాంక్ను అరెస్ట్ చేసి, 14 రోజుల రిమాండ్కు పంపించారు. అసలు జైల్లో ఉండాల్సింది ఎవరు?.. ఫేక్ డాక్యుమెంట్ పెట్టిన రేవంతా? అది ఫేక్ అని చెప్పిన క్రిశాంకా?
-కేటీఆర్
KTR | హైదరాబాద్, మే 2 (నమస్తే తెలంగాణ): ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్స్కు సెలవులు ప్రకటించిన వ్యవహారంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రజలను తప్పుదోవ పట్టించేవిధంగా ఫేక్ డాక్యుమెంట్ పోస్ట్ చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఫేక్ డాక్యమెంట్ సృష్టించడం నేరమని, ఈ వ్యవహారంలో రేవంత్రెడ్డిపై కేసు నమోదు చేయాలని, ఎన్నికల సంఘం కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అందుకు సంబంధించిన ఆధారాలు చూపిస్తానని, ఒకవేళ ఆ సాక్ష్యాలు తప్పని నిరూపిస్తే తాను చంచల్గూడ జైలుకు వెళ్లడానికి సిద్ధమని ప్రకటించారు. తాను చెప్పింది నిజమని రుజువైతే, రేవంత్రెడ్డి జైలుకు వెళ్లాలని సవాల్ చేశారు. గురువారం ఆయన తెలంగాణభవన్లో మీడియాతో మాట్లాడుతూ.. కరెంట్ కోత, నీటి సమస్యను కారణంగా చూపుతూ ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్స్కు సెలవులు ప్రకటించడం, దానిపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ట్వీట్ చేయడం, ఆ మరుసటి రోజు సీఎం రేవంత్రెడ్డి కూడా మరో పోస్ట్ పెట్టడం, బీఆర్ఎస్ నాయకుడు క్రిశాంక్ను అరెస్టు చేయడం తదితర పరిణామాలపై కేటీఆర్ వివరించారు.
నీటికొరత, కరెంట్ సమస్య కారణంగా నెల రోజులపా టు ఓయూ హాస్టల్స్కు సెలవులు ఇస్తున్నట్టు చీఫ్ వార్డెన్ ఇచ్చిన నోటీసుల్లో పేర్కొన్నారని తెలిపారు. పోటీ పరీక్షల నేపథ్యంలో దీనిని వ్యతిరేకిస్తూ ఓయూ విద్యార్థులు ధర్నాకు దిగారని వివరించారు. ఈ నేపథ్యంలో కరెంటు కోత, తాగునీటి సమస్యపై ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ, ఓయూ ఉదంతాన్ని ఉదహరిస్తూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ట్వీట్ చేశారని గుర్తుచేశారు. ఆ వెంటనే చీఫ్ వార్డెన్కు యూనివర్సిటీ రిజిస్ట్రార్ షోకాజ్ నోటీసు ఇచ్చారని, ఎస్పీడీసీఎల్ నుం చి కూడా కరెంట్ సమస్య లేదంటూ ‘వైస్ చైర్మన్’ పేరుతో నోటీసు ఇచ్చారని పేర్కొన్నారు. ‘వైస్ చాన్స్లర్’కు బదులు ‘వైస్ చైర్మన్’ అని పేరొనడం చూస్తుంటే ఈ ప్రభుత్వం తెలివి తేటలు అర్థం చేసుకోవచ్చని ఎద్దేవా చేశారు. మరోవైపు, కేసీఆర్ ట్వీట్ చేసిన మరుసటి రోజే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కూడా ట్విట్టర్లో ఒక నోటీస్ పెట్టారని, తెలిపారు.
సీఎం రేవంత్రెడ్డి పెట్టిన నోటీస్ నకిలీదని వెల్లడి స్తూ, ఓయూ విద్యార్థులే అసలైన నోటీసును సోషల్ మీడియాలో వెలుగులోకి తెచ్చారని కేటీఆర్ వివరించారు. ముఖ్యమంత్రే ఫోర్జరీ డాక్యుమెంట్ను ట్విట్టర్లో పోస్ట్ చేయడం ఏమిటని విద్యార్థులు ప్రశ్నించారని గుర్తుచేశారు. రేవంత్రెడ్డి అనే ఒక పనికిమాలిన నాయకుడు, సీఎం అయి ఉండి కూడా తన పర్సనల్ ట్విట్టర్ ఖాతా ద్వారా ఫేక్ నోటీసును ట్విట్టర్లో పోస్ట్ చేశారని, ప్రజలను తప్పుదోవ పట్టించేవిధంగా చిల్లర ప్రయత్నం చేశారని మండిపడ్డారు. ఇలా ముఖ్యమంత్రి ఫేక్ డాక్యుమెంట్ చేయొచ్చా? అని ప్రశ్నించారు. రేవంత్రెడ్డి పోస్ట్ చేసిన ఫేక్ డాక్యుమెంట్లో చీఫ్ వార్డెన్ స్టాంప్ను కూడా మార్చేశారని వివరించారు. ఫేక్ డాక్యుమెంట్ ద్వారా తప్పు చేసిం ది సీఎం రేవంత్రెడ్డి అయితే, బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్ను అరెస్ట్ చేసి, 14 రోజుల రిమాండ్కు పంపించారని మండిపడ్డారు. అసలు జైల్లో ఉం డాల్సింది ఎవరు.. ఫేక్ డాక్యుమెంట్ పెట్టిన రేవంత్రెడ్డా? అది ఫేక్ డాక్యుమెంట్ అని చెప్పిన క్రిశాంకా? అని ప్రజలు ఆలోచించాలని కోరారు.
ప్రజలను తప్పుదోవ పట్టించడం, ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించ డం నేరమని, ఈ చర్యలకు పాల్పడిన రేవంత్రెడ్డిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభు త్వం తప్పు ఒప్పుకోవాలని హితవు చెప్పారు. సో షల్ మీడియాలో చురుగ్గా ఉన్న క్రిశాంక్ మీద ఉద్దేశపూర్వకంగా అక్రమ కేసు నమోదుచేశారని, దీనిని ప్రజాస్వామికవాదులందరూ ఖండించాలని కోరా రు. క్రిశాంక్ను వెంటనే విడుదలచేయాలని డిమాం డ్ చేశారు. రేవంత్రెడ్డి ఫేక్ డాక్యుమెంట్ పోస్ట్ చేశారని, ఆయనపై ఫోర్జరీ కేసు పెట్టాలని ఓయూ విద్యార్థులు కూడా ఫిర్యాదు చేశారని తెలిపారు. ఫేక్ సర్క్యులర్ పోస్ట్ చేసినందుకు రేవంత్రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరారు.
తెలంగాణ ఉద్యమంలో ఇలాంటి ఎన్నో కేసులు, వేధింపులు చూశామని, ఇలాంటి ఉడుత ఊపులకు తాము భయపడబోమని కేటీఆర్ స్పష్టంచేశారు. న్యాయ వ్యవస్థ మీద తమకు నమ్మకం ఉన్నదని చెప్పారు. సత్యమేవ జయతే అన్నట్టుగా సత్యం, న్యాయం ఏనాటికైనా గెలుస్తుందని పేర్కొన్నారు. రాహుల్గాంధీ మొహబ్బత్ కా దుకాణ్ అంటారని, కానీ, తమ కార్యకర్తల మీద ఈ ప్రభుత్వం దాడులకు తెగబడుతున్నదని విమర్శించారు. వీటన్నింటికి మే 13న బీఆర్ఎస్కు ఓటు వేయడం ద్వారా జవాబు చెప్పాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రేవంత్రెడ్డి వ్యాఖ్యలపై ఈసీ చర్యలు తీసుకుంటుందా? లేదా? అనేది కాలం నిర్ణయిస్తుందని వ్యాఖ్యానించారు. రేవంత్రెడ్డికి ఇవ్వని నోటీసుకు ఇచ్చినట్టుగా ప్రచారం చేసుకుంటున్నారని, బీజేపీ, రేవంత్ షాడో ఫైటింగ్ చేసుకుంటున్నారని పేర్కొన్నారు.