MLA Maheshwar Reddy | హైదరాబాద్, మే 1(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న ఆర్ఆర్ ట్యాక్స్కు కొత్తగా మరో ఆర్ ట్యాక్స్ జతకలిసిందని బీజేఎల్పీ నేత మహేశ్వర్రెడ్డి ఆరోపించారు. ట్రిపుల్ ఆర్ ట్యాక్స్ అంటే.. రాహుల్గాంధీ, రేవంత్రెడ్డి, రియల్ ఎస్టేట్ ట్యాక్స్ అని పేర్కొన్నారు. రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడా రు.
సీఎం రేవంత్రెడ్డి అబద్ధాల పునాదుల మీద రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని, గద్దెనెక్కిన 24 గంటల నుంచే దోపిడీ మొద లు పెట్టారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభు త్వం వచ్చిన తర్వాత హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మూడు నెలలుగా రియల్ ఎస్టే ట్ ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వలేదని తెలిపారు.
బెంగళూరులో డీకే శివకుమార్ ఒక్కో స్కేర్ ఫీట్కు రూ.75 వసూలు చేస్తున్నారని, కాబట్టి తనకు రూ.100 కావాలని రేవంత్రెడ్డి డిమాండ్ చేశారని చెప్పారు. చివరికి రూ.68కి సెటిల్మెంట్ జరిగిందని ఆరోపించారు. ఢిల్లీకి పంపాలి కాబట్టి పూర్తిగా నగదు రూపంలోనే తీసుకుంటున్నారని వివరించారు.
వసూలు చేసిన దాంట్లో చారాణా (25శాతం) ఢిల్లీకి పంపుతున్నారని, బారా ణా (75 శాతం) ఇక్కడే ఎన్నికల్లో ఖర్చు చేస్తున్నారని చెప్పారు. ఇలా కొత్తగా 120 ప్రాజెక్టులతో ప్రభుత్వం సెటిల్మెంట్ చేసి, అనుమతులు ఇచ్చిందని ఆరోపించారు. ట్రిపుల్ ఆర్ ట్యాక్స్ రూపం లో రూ.వేల కోట్ల అవినీతి జరిగిందని చెప్పా రు. వసూళ్లకు భయపడి రియల్టర్లు, బిల్డర్లు హైదరాబాద్లో కాలు పెట్టడానికి భయపడుతున్నారని చెప్పారు.
రేవంత్రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఎన్నోసార్లు ఖజానా ఖాళీ అ య్యిందని చెప్పారని గుర్తుచేశారు. మరి సీఎం పీఠంపై కూర్చున్న తర్వాత లంకె బిందెలు ఉన్నాయని ఎలా అనుకున్నారని ప్రశ్నించారు. ఏడాది కడుపు కట్టుకుంటే రూ.40వేల కోట్లు వస్తాయని, వాటిని సంక్షే మ పథకాలకు ఖర్చు చేస్తానని రేవంత్రెడ్డి అంటున్నారన్నారు. త్వరలో సీఎం రేవంత్రెడ్డికి చెందిన కొత్త అవినీతిని బయటకు తీసుకువస్తానని వెల్లడించారు. పార్లమెంట్ ఎన్నికల్లో అయినా తప్పుడు హామీ లు ఇచ్చే వారిని నమ్మవద్దని ప్రజలను కోరారు.