Trains delay: ఉత్తరాదిపై దట్టంగా పొగమంచు కమ్మింది. శీతాకాలం మొదలైనప్పటి నుంచి దేశ రాజధాని ఢిల్లీ సహా పలు ఉత్తరాది రాష్ట్రాలపై పొగమంచు కమ్ముకుంటున్నప్పటికీ.. ఇప్పుడు పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. ఉదయం వేళల్లో రోడ్ల మీదకు వచ్చే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విజిబిలిటీ సరిగా లేక ప్రమాదాల బారినపడుతున్నారు.
వారం రోజులుగా పొగమంచు మరింత ఎక్కువ కావడం వల్ల కొన్ని ప్రాంతాల్లో ఉదయం వేళల్లో కనీసం 10 మీటర్ల దూరం కూడా కనిపించడం లేదు. దాంతో వాహనాలకేగాక రైళ్లు, విమానాల రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఇవాళ కూడా పొగమంచు కారణంగా పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. మరికొన్ని రైలు సర్వీసులు పూర్తిగా రద్దయ్యాయి.
రైళ్లు ఆలస్యంగా నడుస్తుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గంటల తరబడి రైల్వేస్టేషన్లలో పడిగాపులు కాస్తున్నారు. రైల్వే స్టేషన్లలో సరిపడా చోటులేకపోవడంతో ప్రయాణికులు ఎక్కడివాళ్లు అక్కడే కూర్చుని నిద్రపోయే దుస్థితి నెలకొది. న్యూఢిల్లీ, యూపీలోని మొరాదాబాద్ రైల్వేస్టేషన్లలో రైళ్ల కోసం పడిగాపులు కాస్తున్న ప్రయాణికులకు సంబంధించిన దృశ్యాలను కింది వీడియోలో చూడవచ్చు.
#WATCH | Delhi: Passengers await the movement of their scheduled trains as several trains get delayed and a few get cancelled due to fog.
(Visuals from New Delhi Railway station) pic.twitter.com/ZM0I0Yjbvz
— ANI (@ANI) January 17, 2024
#WATCH | Delhi: “I am travelling to Kerala. My train- Kerala Express is five hours late from the scheduled time…,” says a passenger Ajay at New Delhi Railway station https://t.co/vaqyNhQPiA pic.twitter.com/hki78DNdan
— ANI (@ANI) January 17, 2024
#WATCH | Uttar Pradesh: Passengers face difficulty at Moradabad Railway Station as several trains run late due to coldwave & fog conditions. pic.twitter.com/cy02j3Jh8m
— ANI UP/Uttarakhand (@ANINewsUP) January 16, 2024