టెహ్రాన్: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీతో పాటు మొత్తం 9 మంది హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. అయితే వారి మృతదేహాలను గుర్తించారు. రెస్క్యూ ఆపరేషన్కు వెళ్లిన ప్రత్యేక దళాలు.. హెలికాప్టర్ శిథిలాల వద్ద రైసీతో పాటు ఇతరుల మృతదేహాలను పసికట్టారు. ఆ తర్వాత వారి భౌతికకాయాలను తబ్రిజ్ నగరానికి తరలించారు. రైసీ మృతదేహం కోసం జరిగిన రెస్క్యూ ఆపరేషన్ ముగిసినట్లు ఇస్లామిక్ రిపబ్లిక్ రెడ్ క్రిసంట్ సొసైటీ అధిపతి హుసేన్ కోలివంద్ తెలిపారు. మృతుల పార్దీవదేహాలను ఈస్ట్ అజర్బైజాన్ ప్రావిన్సుకు తరలించినట్లు వెల్లడించారు. అక్కడ వాళ్లను ఖననం చేయనున్నట్లు చెప్పారు. వాయవ్య ఇరాన్లో పర్వత శ్రేణుల్లో రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఆదివారం కూలిన విషయం తెలిసిందే.
BREAKING: TRANSFERRING OF BODIES FROM HELICOPTER CRASH INVOLVING IRAN PRESIDENT RAISI pic.twitter.com/b8J78VC0S0
— Sulaiman Ahmed (@ShaykhSulaiman) May 20, 2024