Gautam Gambhir: భారత మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ శనివారం ఉదయం తిరుమల తిరుపతి దేవస్థానంలోని శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. తన సతీమణి నటషా జైన్ గంభీర్తో కలిసి ఆయన శ్రీవారి దర్శనం చేసుకున్నారు. గంభీర్ దంపతులకు ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు.
అనంతరం గంభీర్ దంపతులు ఆలయం లోపల స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకుల నుంచి ఆశీర్వచనాలు అందుకున్నారు. కాగా, క్రికెట్కు గుడ్ బై చెప్పిన అనంతరం 2019లో గంభీర్ రాజకీయాల్లో చేరారు. భారతీయ జనతాపార్టీలో చేరి నార్త్ ఢిల్లీ నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. ఇటీవల తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించారు.
#WATCH | Tirupati, Andhra Pradesh: Former cricketer and BJP MP Gautam Gambhir offered prayers at the Tirupati Balaji Temple. pic.twitter.com/MDzxTlhV5a
— ANI (@ANI) March 9, 2024