AAP MLAs: ఢిల్లీ అసెంబ్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) పార్టీ ఎమ్మెల్యేలు లేచి నిలబడి ఆప్ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు సెల్యూట్ చేశారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో మనీశ్ సిసోడియా అరెస్టయ్యి నేటికి సరిగ్గా ఏడాది పూర్తయిన సందర్భంగా కేజ్రీవాల్ ఆ విషయాన్ని సభలో గుర్తుచేశారు. ఆప్ సభ్యులంతా సభలో లేచి నిలబడి ఆయనకు సెల్యూట్ చేయాలని కోరారు.
దాంతో ఆప్ సభ్యులంతా లేచి నిలబడి మనీశ్ సిసోడియాకు సెల్యూట్ చేశారు. అంతకుముందు కేజ్రీవాల్ మాట్లాడుతూ.. మరే ప్రభుత్వ చేయనన్ని మంచి పనులు మనీశ్ సిసోడియా చేశారని అన్నారు. సిసోడియా లాంటి వ్యక్తులు వ్యవస్థను ఎదిరించినప్పుడల్లా ఎలాంటి అన్యాయాలకు గురయ్యారనే దానికి చరిత్ర సాక్ష్యమని కేజ్రీవాల్ చెప్పారు.
#WATCH | AAP MLAs stand and salute party leader Manish Sisodia, in the Assembly.
Delhi CM Arvind Kejriwal says, “He (Manish Sisodia) did what no other government could do. History is witness that when such people come and challenge the system, such injustice is done to them…”… pic.twitter.com/CL5cA1SRJ4
— ANI (@ANI) February 26, 2024