పట్నా: అది ఓ ఆస్పత్రి. ఒక వార్డులో చికిత్స కోసం వచ్చిన రోగులు, అటెండెంట్లు వైద్యుల కన్సల్టేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇంతలో ఓ వ్యక్తి తుపాకీ పట్టుకుని ఆస్పత్రిలో చొరబడ్డాడు. వచ్చీరావడంతోనే ఓ వ్యక్తిపై కాల్పులు జరిపాడు. బీహార్ రాష్ట్రంలోని ఆర్రాహ్ పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పక్కనే ఉన్న మరో వ్యక్తి దుండగుడిని పట్టుకునే ప్రయత్నం చేయగా పరుగందుకున్నాడు. వెంబడించినా దొరకలేదు.
తూటా తగిలిన వ్యక్తికి వైద్యులు వెంటనే చికిత్స చేశారు. ప్రస్తుతం అతడికి ఎలాంటి అపాయం లేదని చెప్పారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలానికి వచ్చి వివరాలు సేకరించారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. కాగా, దుండగుడు కాల్పులు జరిపిన దృశ్యాలు హాస్పిటల్ సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.
#WATCH | A person was shot by an unknown assailant inside a hospital in Bihar’s Arrah yesterday
Sub-Inspector Anil Singh says, “The injured is being treated. Further investigation is being done.”
(CCTV visuals source: Hospital) pic.twitter.com/Jc3xBiLJ8r
— ANI (@ANI) September 1, 2023