బూస్టర్ డోస్ ఎప్పుడు వేస్తారో చెప్పాలంటూ కాంగ్రెస్ సహా కొన్ని ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోన్న నేపథ్యంలో కేంద్రం స్పందించింది. కోవిడ్-19 టాస్క్ఫోర్స్ చైర్మన్ వీకే పాల్ మాట్లాడుతూ… శాస్త్రీయంగా చర్చ జరిగిన తర్వాతే బూస్టర్ విషయంలో తాము ఓ ఫైనల్ నిర్ణయానికి వస్తామని తెలిపారు. కేంద్ర ఆరోగ్య మంత్రి కూడా ఇదే విషయాన్ని పార్లమెంట్లో ప్రకటించారని ఆయన గుర్తు చేశారు. బూస్టర్ డోస్ ఆవశ్యకత, సమయం, స్వరూప స్వభావాలు… ఇవన్నీ కూడా శాస్త్రీయంగా చర్చలు జరిగిన తర్వాతే ఓ తుది నిర్ణయానికి వస్తామని కేంద్ర ఆరోగ్య మంత్రి పార్లమెంట్ లో కూడా పేర్కొన్నారు అని వీకే పాల్ అన్నారు. కోవిడ్ ప్రాథమిక దశలో ఉన్న లక్షణాలు, ఇప్పటి లక్షణాలు ఒకేలా ఉన్నాయా? లేదంటే ఏవైనా మార్పులు ఉన్నాయా? అన్న కోణాన్ని కూడా శాస్త్రవేత్తలు క్షుణ్ణంగా అధ్యయనం చేస్తూనే ఉన్నారని ఆయన వెల్లడించారు.