Rats In Train Pantry | రైళ్లలో అందించే ఆహార పదార్థాల నాణ్యత గురించి ఏదో ఒక వివాదం తరచూ నెలకొంటూనే ఉంటుంది. ఆహారం సరిగా లేదని, రైల్వే పాంట్రీ అపరిశుభ్రంగా ఉందంటూ ప్రయాణికులు తరచూ కంప్లెయింట్స్ చేస్తుంటారు. అయితే, రైలు కిచెన్లో ఎలుకలు తిరగడం ఇప్పుడు కలకలం రేపుతోంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
మంగిరీశ్ టెండూల్కర్ అనే వ్యక్తి అక్టోబర్ 15వ తేదీన తన కుటుంబంతో కలిసి 11099 LTT MAO ఎక్స్ప్రెస్ రైల్లో ప్రయాణించాడు. ఆ సమయంలో రైలు వంట గదిలో కొన్ని ఎలుకలు (Rats) తిరగడం గమనించాడు. వెంటనే ఆ దృశ్యాలను తన మొబైల్ ఫోన్లో బంధించి.. సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఆ వీడియోలో ఎలుకలు వంట గది మొత్తం తిరుగుతూ.. అక్కడున్న పాత్రల్లోని ఆహారాన్ని తింటూ కనిపించాయి. రైలు పాంట్రీ (Train Pantry)లో 6 నుంచి 7 ఎలుకలు తిరుగుతున్నాయంటూ ఆ వీడియోకు క్యాప్షన్ జోడించాడు. ఈ ఘటనపై రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్కి ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించినట్లు చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
ఈ సంఘటనపై ఐఆర్సీటీసీ (IRCTC) స్పందించింది. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్నట్లు తెలిపింది. రైళ్లో కిచెన్ పరిశుభ్రంగా ఉంచేలా సిబ్బందికి అవగాహన కల్పించినట్లు పేర్కొంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా తగిన చర్యలు తీసుకుంటామని వివరణ ఇచ్చింది.
Also Read..
Urvashi Rautela | ఫోన్ ఆచూకీ తెలుసుకున్న ఊర్వశి.. తిరిగిచ్చేందుకు కండిషన్ పెట్టిన అజ్ఞాత వ్యక్తి
Viral Video | రిస్కీ స్టంట్.. సైకిల్ తొక్కుతూ స్కిప్పింగ్ చేసిన మహిళ
Air India Express | నయా లుక్లో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు.. ఫొటోలు వైరల్