బాలాసోర్: ఒడిశా రాష్ట్రం బాలాసోర్ జిల్లాలోని బహనగ రైల్వే స్టేషన్ దగ్గర మూడు రైళ్లు ఢీకొన్న ఘటనలో మృతుల సంఖ్య 300కు చేరువైంది. అదేవిధంగా 900 మందికిపైగా క్షతగాత్రులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ విషాదకర ఘటన శుక్రవారం సాయంత్రం 6.55 గంటలకు జరిగిందని నిపుణుల బృందం తేల్చింది. ఈ మేరకు రైల్వే శాఖకు నిపుణుల బృందం తమ ప్రాథమిక నివేదికను అందించింది.
లూప్లైన్లో ఆగివున్న గూడ్స్ రైలును రాంగ్ సిగ్నల్ కారణంగా కోరమాండల్ ఎక్స్ప్రెస్ వేగంగా ఢీకొట్టింది. కోరమాండల్ స్పీడ్కు ఆ రైలు ఇంజిన్ గూడ్స్ రైలు బోగీలపైకి ఎక్కి ఆగిపోయింది. వెనుక బోగీలు పట్టాలు తప్పి ఫల్టీలు కొట్టాయి. ఇంతలో హైరా-బెంగళూరు ఎక్స్ప్రెస్ రైలు వచ్చి పట్టాలకు అడ్డంగా పడివున్న బోగీలను ఢీకొట్టింది. దాంతో ఆ రైలు బోగీలు కూడా పట్టాలు తప్పి ట్రాక్ వెంబడి చెల్లాచెదురుగా పడ్డాయి.
#WATCH | Latest aerial visuals from the site of the deadly train accident in Odisha’s #Balasore
As per the latest information, the death toll stands at 238 in the collision between three trains.#BalasoreTrainAccident pic.twitter.com/PusSnQ3XWw
— ANI (@ANI) June 3, 2023