న్యూఢిల్లీ: టేకాఫ్కు ముందు ఎయిర్పోర్ట్లో విద్యుత్ లైట్ల స్తంభాన్ని విమానం ఢీకొట్టింది. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో సోమవారం ఈ ఘటన జరిగింది. ఎయిర్పోర్ట్లోని రన్వేపై ఉన్న స్పైస్జెట్ విమానం టేకాఫ్ కోసం సిద్ధమైంది. పైలట్ ఈ విషయాన్ని ప్రయాణికులకు వెల్లడించారు. ఇంతలో ఆ విమానం రన్వేపై మెల్లగా వెనక్కి వెళ్లింది. అయితే రన్వేకు పక్కగా ఉన్న లైట్ల స్తంభాన్ని కుడివైపు ఉన్న విమానం రెక్క ఢీకొట్టింది. దీంతో ఆ స్తంభం ఒక పక్కకు ఒరిగిపోయింది. విమానం కుడి వైపు రెక్క ఎయిర్లైన్ స్వల్పంగా దెబ్బతిన్నది. గమనించిన పైలట్ వెంటనే విమానాన్ని నిలిపివేశారు. మరింత నష్టం జరుగకుండా దానిని ముందుకు నడిపారు.
స్పైస్జెట్కు చెందిన బోయింగ్ 737-800 విమానం ప్యాసింజర్ టెర్మినల్ నుంచి రన్వే మీదకు వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. ఢిల్లీ నుంచి జమ్ముకు వెళ్లాల్సిన ఈ విమానంలోని ప్రయాణికులెవరికీ ఏమీ కాలేదు. విమానం కుడివైపు రెక్క స్తంభాన్ని ఢీకొట్టడంతో దానిని తిరిగి టెర్మినల్కు చేర్చారు. అందులోని ప్రయాణికులను మరో విమానంలోకి ఎక్కించి జమ్ముకు చేర్చారు. అయితే ఈ ఘటనపై డీజీసీఏ దర్యాప్తునకు ఆదేశించింది.
మరోవైపు ఆ విమానంలో ప్రయాణిస్తున్న ఒకరు ఈ ఘటనను తన మొబైల్ ఫోన్లో రికార్డు చేశారు. ప్రశాంతో అనే ట్విట్టర్ యూజర్ ఈ వీడియోను బుధవారం షేర్ చేశారు. 50 సెకండ్ల నిడివి ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
The SpiceJet pushback incident at DEL. The 737-800, with Capt Monica Khanna in command, was pushed back beyond the taxi line threshold, hitting a pole and damaging the right aileron. pic.twitter.com/HWiwYakE1u
— PKR | প্রশান্ত | پرشانتو (@prasanto) March 30, 2022