KCR | హైదరాబాద్ : అవకాశం వస్తే వంద శాతం ప్రధాని రేసులో ఉంటాను అని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. వచ్చే సెషన్లో కేసీఆర్ ప్రళయ గర్జన చూస్తరు అని కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విలేకరులు అడిగిన ప్రశ్నలకు కేసీఆర్ సమాధానం ఇచ్చారు.
వచ్చే అసెంబ్లీలో కేసీఆర్ ప్రళయ గర్జన చూస్తారు. డెఫినెట్గా చూస్తరు. అవకాశం వస్తే వంద శాతం ప్రధాని రేసులో ఉంటాను. అవకాశం వస్తే ఎవరైనా ఉండరా..? నేను అంత అమాయకుడినా..? అవకాశం రావాల్నే కానీ.. తప్పకుండా రేసులో ఉంటాను. పార్లమెంటరీ పార్టీ లీడర్ సురేశ్ కాబోతున్నారు. చైర్మన్కు నేను రేపు లెటర్ ఇష్యూ చేస్తున్నాను. సురేశ్ ఈజ్ మెయిన్ ప్లేయర్ ఇన్ ఢిల్లీ అని కేసీఆర్ పేర్కొన్నారు.
ఒక రోజు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ నీ దొడ్లే ఎంత మంది ఉంటారో చూడు అని అన్నారు. ఏం కాలేదు. ఇది కూడా అంతే ఉంది. ఈయననే బీజేపీలోకి జంపు కొడుతురాని కాంగ్రెస్ పార్టీలో అనుమానాలు ఉన్నాయి. ఓటుకు నోటు కేసులో ఆయన తప్పించుకోలేరు. కాబట్టి కిందమీద అయితే కేసులు తప్పించుకునేందుకు బీజేపీలోకి వెళ్తాడని అనుకుంటున్నారు. మా పార్టీలోకే కాంగ్రెసోళ్లు రాబోతున్నారు. నన్ను ఎవరూ డైరెక్ట్ అడగలేదు. మా పార్టీలో ఉన్న ముఖ్యులను కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముఖ్యులు కన్సల్ట్ అవుతున్నారు. 26 నుంచి 33 మంది ఎమ్మెల్యేలం రెడీగా ఉన్నాం. ఇద్దరం కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దాం అని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఏం జరగబోతదో చూద్దాం అని కేసీఆర్ అన్నారు.
బీఆర్ఎస్ బీఆర్ఎస్గానే ఉంటది. పెద్దపల్లితో పాటు మిగతా ఎస్సీ నియోజకవర్గాల్లో మాదిగ సామాజిక ఆగ్రహంగా ఉన్నారు. పెద్దపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించి చూపెడుతామన్నారు. ఆ ఆగ్రహానికి కాంగ్రెస్ బలి అవుతది. జిల్లాలు తీసేస్తామంటే యుద్ధానికి సిద్ధమని ప్రజలు అంటున్నారు. ఇది కూడా కాంగ్రెస్కు ఎఫెక్ట్ అవుతోంది అని కేసీఆర్ పేర్కొన్నారు.