ముంబై : దేశ వాణిజ్య రాజధాని ముంబై లోకల్ ట్రైన్లో ప్రయాణీకులు సందడి చేశారు. లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ పాటలకు ప్యాసింజర్ల గ్రూపు లోక్ల్ ట్రైన్లో (Viral Video) ఆటపాటలతో హోరెత్తించారు. ఈ వీడియోను చిల్ల్డ్ యోగి అనే ఖాతా ట్విట్టర్లో షేర్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
One of the best jamming session I have seen… #mumbailocal pic.twitter.com/OQHggIJTIG
— 24 (@Chilled_Yogi) March 4, 2023
నిమిషం వ్యవధి కలిగిన ఈ వీడియోలో ముంబై లోకల్ ట్రైన్లో లతాజీ సాంగ్స్ను ఆలపిస్తూ నృత్యాలు చేస్తూ తోటి ప్రయాణీకుల్లో ఉత్సాహం నింపారు. ఈ పాటలకు కొందరు ప్రయాణీకులు రైలు కిటికీలు, తలుపులపై చేతులతో దరవేయడం కనిపిస్తుంది.
తాను చూసిన అత్యత్తుమ ఆటపాటల సెషన్స్లో ఇది ఒకటని వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియో ఆన్లైన్లో షేర్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకూ 12,000కుపైగా వ్యూస్ లభించాయి. ప్రయాణీకుల ఉత్సాహంపై నెటిజన్లు ప్రశంసలు గుప్పించారు. ఈ అంకుల్స్ తమ రైలు ప్రయాణాన్ని మరింత అందంగా మార్చారని ఓ యూజర్ కామెంట్ చేయగా బిందాస్ అంటూ మరో యూజర్ రాసుకొచ్చారు.
Read More :