ASP | ఫోన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి (Chief Minister)కి సెల్యూట్ చేసిన ఓ పోలీసు అధికారి చివరకు ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురయ్యారు. క్రమశిక్షణ చర్యల కింద బదిలీ వేటు వేశారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఆగస్టు 11న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంతకీ ఏం జరిగిందంటే..
ఉత్తరాఖండ్ (Uttarakhand) పౌరీ గర్వాల్ (Pauri Garhwal) జిల్లా కోట్ద్వార్ (Kotdwar) ప్రాంతంలోని విపత్తు ప్రాంతాలను ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి (Pushkar Singh Dhami ) సందర్శించారు. ఆ సమయంలో కోట్ద్వార్ అదనపు పోలీసు సూపరింటెండెంట్ (ASP) శేఖర్ సుయాల్ (Shekhar Suyal) బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు. సీఎం రాక గురించి తెలియగానే స్థానిక యంత్రాంగం హెలిప్యాడ్ వద్ద ముఖ్యమంత్రికి స్వాగతం పలికేందుకు వెళ్లారు. అయితే ముఖ్యమంత్రి హెలికాఫ్టర్ నుంచి దిగిన సమయంలో ఏఎస్పీ ఫోన్లో మాట్లాడుతున్నాడు. ఒక చేత్తో ఫోన్ను చెవిలో పెట్టుకునే మరో చేత్తో సీఎంకు సెల్యూట్ చేశాడు.
ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. వీడియోపై అధికారులు తక్షణమే స్పందించారు. సదరు ఏఎస్పీపై క్రమశిక్షణా చర్యల కింద బదిలీ వేటు వేశారు. ఈ మేరకు నరేంద్ర నగర్లోని పోలీస్ శిక్షణా కేంద్రానికి బదిలీ చేశారు. ఆయన స్థానంలో కోట్ ద్వార్కు అదనపు పోలీసు సూపరింటెండెంట్గా జై బలూనిని నియమించారు.
కాగా, రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో వరదలు సంభవించాయి. కోట్ ద్వార్లో పలు వంతెనలు కొట్టుకుపోయాయి. దీంతో నీరంతా గ్రామాల్లోకి ప్రవేశించడంతో అనేక ఇళ్లు బురద నీటితో మునిగిపోయాయి. విపత్తు ప్రాంతాలను ముఖ్యమంత్రి స్వయంగా సందర్శించి పరిస్థితిని పర్యవేక్షించారు.
लगता है फोन दिल्ली से था, जो CM पुष्कर धामी को रिसीव करते वक्त भी कान से नहीं हटा। #uttarakhand pic.twitter.com/sfx2NtfJtl
— Sachin Gupta (@SachinGuptaUP) August 12, 2023
Also Read..
Heavy Rains | నదీ ప్రవాహంలో చిక్కుకుపోయిన ట్రక్కు.. వీడియో
Well Collapses | ఎద్దును కాపాడబోయి ఐదుగురు దుర్మరణం
Himachal Pradesh | జలప్రళయంతో రూ.10వేల కోట్లు నష్టపోయిన హిమాచల్.. 74 మంది మృతి