Heavy Rains | ఉత్తరాఖండ్ (Uttarakhand) రాష్ట్రాన్ని భారీ వర్షాలు (Heavy Rains) ముంచెత్తుతున్నాయి. ఆ రాష్ట్ర వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాలకు వరదలు సంభవించాయి. పలు నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో వరద నీటిలో ఇళ్లు కొట్టుకుపోతున్నాయి. రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. తాజాగా ఓ ట్రక్కు (Truck ) వరద నీటిలో చిక్కుకుపోయిన వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది.
భారీ వర్షాలకు పౌరీ గర్హ్వాల్ (Pauri Garhwal) జిల్లాలోని మోటాధక్ (Motadhak) గ్రామంలోని మలాన్ నది (Malan River) ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. నదికి అడ్డంగా ఉన్న ఓ వంతెన ఇటీవలే విరిగిపోయింది. దీంతో అటుగా వెళ్లే వాహనాలు నది గుండా వెళ్లాల్సి వస్తోంది. ఈ క్రమంలో గురువారం సాయంత్రం ఓ ట్రక్కు నదిని దాటేందుకు ప్రయత్నిస్తుండగా.. ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరగడంతో అక్కడే ఇరుక్కుపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
మరోవైపు గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఉత్తరాఖండ్ రాష్ట్రం భారీ నష్టాన్ని చవిచూసింది. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు ఎక్కడికక్కడ కొండచరియలు (landslides) విరిగిపడుతున్నాయి. సుమారు 250కిపైగా రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. పలు రోడ్లను అధికారులు మూసివేశారు. దీంతో వందలాది గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి. జూన్ 15వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు సుమారు 75 మంది మరణించినట్లు ప్రభుత్వం తెలిపింది. వర్షాలకు సంబంధించిన సంఘటనల్లో సుమారు 43 మంది గాయపడ్డారని.. మరో 19 మంది గల్లంతైనట్లు పేర్కొంది. 1,400కు పైగా ఇళ్లు దెబ్బతిన్నట్లు వెల్లడించింది.
ఇదిలా ఉండగా.. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) తాజాగా వెల్లడించింది. ఈ మేరకు రాబోయే రెండు రోజుల పాటు రాష్ట్రానికి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆగస్టు 22 తర్వాత వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని అంచనా వేసింది.
Video: Truck Gets Stuck While Crossing Swelling Uttarakhand River https://t.co/bsNZDwFawZ pic.twitter.com/2XpmOZYA5u
— NDTV (@ndtv) August 18, 2023
Also Read..
Well Collapses | ఎద్దును కాపాడబోయి ఐదుగురు దుర్మరణం
Himachal Pradesh | జలప్రళయంతో రూ.10వేల కోట్లు నష్టపోయిన హిమాచల్.. 74 మంది మృతి
Kiara Advani | ఆ విషయంలో నాకు నేనే పోటీ.. కియారా అద్వానీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!