న్యూఢిల్లీ, డిసెంబర్ 19: ప్రభుత్వ విధానాలను ఎప్పటికప్పుడూ ఎండగట్టే కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదికల సంఖ్య ఏటికేడు తగ్గిపోతున్నది. కేంద్రంలో బీజేపీ వచ్చిన 2014-2018 మధ్యలో ఏడాదికి సగటున 40 కాగ్ నివేదికలు వెలువడగా, 2019-2023 మధ్య ఇది 22కి తగ్గిపోయింది.
2023లో కేవలం 18 కాగ్ మాత్రమే వచ్చాయి. విమర్శలు బయటకు రాకుండా అధికారపక్షం వ్యవహరిస్తున్నదని విపక్షాలు మండిపడుతున్నాయి.