న్యూఢిల్లీ : (Venkaiah Naidu) విజయదశమి పర్వదినం సందర్భంగా దేశ ప్రజలందరికీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే దసరా పండుగ.. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తు అని ఆయన అన్నారు. అంతేకాకుండా.. మర్యాద పురుషోత్తముడైన శ్రీరాముడి ఆదర్శవంతమైన జీవనాన్ని మనకు గుర్తుచేస్తుందని, వారు పాటించి చూపిన సన్మార్గంలో మనం కూడా పయనించేందుకు మార్గదర్శనం చేస్తుందన్నారు.
మనలోని చెడు ఆలోచనలను వదులుకుంటూ, సానుకూల దృక్పథంతో ముందుకెళ్లేందుకు దసరా పండుగ అందరి జీవితాల్లో శాంతి, సమరసతా, సమృద్ధి తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నాను అని వెంకయ్యనాయుడు తన సందేశంలో పేర్కొన్నారు.
దోమలకు ఇది నచ్చదు.. మీరు అలా పెట్టగానే ఇలా పరార్..!
బంగ్లాదేశ్లోని ఆలయాలపై దాడులు, పండల్స్ ధ్వంసం
ఎయిరిండియా ఐపాయే.. ఇప్పుడిక వీటి వంతు..!
కొవిడ్ మూలాలు తెలుసుకునే చివరి ప్రయత్నం.. చైనాకు డబ్ల్యూహెచ్ఓ నిపుణులు
నార్వేలో బాణంతో దాడి, ఐదుగురు మృతి
3.65 లక్షల మందితో కలిసి బౌద్ధమతం స్వీకరించిన అంబేడ్కర్
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..