అహ్మాదాబాద్: మజ్లిస్ పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీతో పాటు ఇతర పార్టీ నేతలు ప్రయాణిస్తున్న వందేభారత్ రైలుపై దాడి జరిగింది. గుజరాత్ రాజధాని అహ్మాదాబాద్ నుంచి సూరత్ వెళ్తున్న రైలుపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. ఓవైసీ కూర్చున్న బోగీపై రాళ్లు రువ్వడంతో ఆ బోగీలోని అద్దాలు పగిలాయి. ఈ విషయాన్ని ఆ పార్టీ నేత వారిస్ పఠాన్ తెలిపారు. తన ట్విట్టర్లో ఆయన ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలను పోస్టు చేశారు. సూరత్కు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న సమయంలో ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది.
Travelling from Ahmedabad to surat vande bharat Express
.#GujaratElections2022 pic.twitter.com/ewLxFFUnee— Waris Pathan (@warispathan) November 7, 2022