Joshimath | ఉత్తరాఖండ్లోని జోషిమఠ్ బాధితులకు ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. బాధిత కుటుంబాలకు తక్షణ సాయం కింద రూ.1.5లక్షలు అందించనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు బుధవారం ముఖ్యమంత్రి పుష్కరసింగ్ ధామీ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.
జోషిమఠ్ పట్టణంలోని పలు ప్రాంతాల్లో భూమి కోతకు గురికావడం, పగుళ్లతో భయానక పరిస్థితి నెలకొంది. పట్టణంలో మొత్తంగా దాదాపు 4,500 భవనాలు ఉండగా ఇప్పటివరకు 723భవనాలకు పగుళ్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. 131 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు చెప్పారు. ప్రమాదకరంగా ఉన్న భవనాలకు అధికారులు సీల్ వేసినట్లు చెప్పారు. ప్రమాదకరం అని గుర్తించిన రెండు హోటల్ భవనాలు మినహా మరే ఇతర భవనాన్ని కూల్చివేయలేదని అధికారులు వెల్లడించారు.
मुख्यमंत्री श्री @pushkardhami जी द्वारा दिए गए निर्देशों का अनुपालन करते हुए प्रभावित परिवारों को तात्कालिक तौर पर ₹1.5 लाख की धनराशि अंतरिम सहायता के रूप में दी जा रही है।
— Office Of Pushkar Singh Dhami (@OfficeofDhami) January 11, 2023