రుద్రప్రయాగ్: దీపావళి పండుగ సందర్భంగా దేశంలోని ఆలయాలన్నీ సర్వాంగసుందరంగా ముస్తాబయ్యాయి. రకరకాల పూలతో ఆలయాలన్నింటినీ చూడచక్కగా అలంకరించారు. ఉత్తరాఖండ్ రాష్ట్రం రుద్రప్రయాగ్లోని బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయాలు విశేష పుష్పాలంకరణలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రంగురంగుల పూల అలంకరణలతో సుందరంగా ముస్తాబైన ఈ ఆలయాలు భక్తులకు కనువిందు చేస్తున్నాయి.
కాగా, దీపావళి పండుగను పురస్కరించుకుని రేపు తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తనున్నారు. భారీ సంఖ్యలో తరలి వచ్చే భక్తులతో ఆలయాలన్నీ కిక్కిరిసిపోనున్నాయి. అర్చకుల వేదమంత్రోచ్ఛరణలు, భక్తుల సందడితో ఆలయాలన్నీ ప్రత్యేక శోభను సంతరించుకోనున్నాయి. పుష్పాలతో అలంకృతమైన బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయాలను కింది వీడియోలలో మీరు వీక్షించవచ్చు..
#WATCH | Rudraprayag, Uttarakhand: Kedarnath temple decorated with flowers ahead of Diwali festival pic.twitter.com/8GMMVF7RDI
— ANI UP/Uttarakhand (@ANINewsUP) November 11, 2023
#WATCH | Uttarakhand: Badrinath Temple decorated with flowers ahead of Diwali festival pic.twitter.com/aCbryWM7nx
— ANI UP/Uttarakhand (@ANINewsUP) November 11, 2023