మహారాజ్గంజ్: పదేళ్ల క్రితం నాటి డబుల్ మర్డర్ కేసులో నిందితుడికి యూపీలోని మహారాజ్గంజ్ కోర్టు మరణశిక్ష(Death Penalty)ను ఖరారు చేసింది. బైజనాథ్ అనే వ్యక్తి 14 ఏళ్ల మైనర్ను, మరో వ్యక్తిని హత్య చేశాడు. ఓ ప్రాపర్టీ విషయంలో గొడవ రావడంతో నిందితుడు హత్యకు పాల్పడ్డాడు. మరణశిక్షతో పాటు నిందితుడికి 2.25 లక్షల జరిమానా కూడా కోర్టు విధించింది. అదనపు సెషన్స్ జడ్జి పవన్ కుమార్ శ్రీవాత్సవ్ ఆ కేసులో ఇవాళ తీర్పును ఇచ్చారు. 2014, ఏప్రిల్ 2వ తేదీన ఆ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. రాజేంద్ర కుమార్ చౌదరీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు బుక్ చేశారు. రాజేంద్ర కుమార్ కూతున్ని, ఆయన సోదరుడిని బైజనాథ్ ఓ పదునైన ఆయుధంతో హత్య చేశాడు.