లక్నో : ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీనే విజయం సాధిస్తుందని, 80 శాతం స్థానాలు తమవే అని ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ ధీమా వ్యక్తం చేశారు. గోరఖ్పూర్ అర్బన్ నుంచి బరిలో ఉన్న యోగి ఆదిత్యనాథ్.. ఆరో విడతలో భాగంగా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం యోగి మీడియాతో మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో యూపీలో బీజేపీ ప్రభంజనం సృష్టిస్తుందన్నారు. ఆరో విడతలో జరుగుతున్న 57 స్థానాల్లో అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంటామని చెప్పారు. 300 స్థానాలకు పైగా విజయం సాధించడం టార్గెట్గా పెట్టుకున్నామని యోగి స్పష్టం చేశారు.
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి ఆరో విడత ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. 10 జిల్లాల పరిధిలోని 57 స్థానాల్లో సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ 57 స్థానాల్లో 676 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
#WATCH Uttar Pradesh Chief Minister Yogi Adityanath casts his vote in the sixth phase of Assembly elections, in Gorakhpur
Voting is underway in 57 Assembly seats across 10 districts; 676 candidates including CM Adityanath in the fray pic.twitter.com/2VeHTDRBGZ
— ANI UP/Uttarakhand (@ANINewsUP) March 3, 2022