న్యూఢిల్లీ: గుజరాత్ అల్లర్లకు సంబంధించి ప్రధాని మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని ప్రదర్శించకుండా ఆపేందుకు కేంద్ర ప్రభుత్వం సర్వశక్తులూ ఒడ్డుతున్నది.
ఢిల్లీలోని జేఎన్యూలో డాక్యుమెంటరీని ప్రదర్శించకుండా అక్కడి యాజమాన్యం కరెంటు తీసేయగా, జామియా మిలియా యూనివర్సిటీ ఏకంగా చిత్ర ప్రదర్శనపై నిషేధం విధించింది. భారీ ఎత్తున పోలీసులను మోహరించింది. పోలీసులు ఎస్ఎఫ్ఐకి చెందిన నలుగురు కార్యకర్తలను అరెస్టు చేశారు.