Anand Mahindra | దేశీయ వాహన తయారీ సంస్థ ‘మహీంద్రా అండ్ మహీంద్రా’ (Mahindra And Mahindra) చైర్మన్ ఆనంద్ మహీంద్రా (Anand Mahindra)పై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)కు చెందిన ఓ వ్యక్తి మహీంద్రాపై చీటింగ్ కేసు పెట్టాడు. అతడి ఫిర్యాదు మేరకు మహీంద్రాతో పాటు మరో 12 మందిపై కాన్పూర్ (Kanpur) పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.
యూపీకి చెందిన రాకేశ్ మిశ్రా 2022లో మహీంద్రా కంపెనీకి చెందిన స్కార్పియో (Scorpio)ను తన కుమారుడు అపూర్వ్కు కొనిచ్చాడు. దాని విలువ అప్పుడు రూ. 17.39 లక్షలు. దీంతో 2022 జనవరి 14 వ తేదీన అపూర్వ్ తన స్నేహితులతో కలిసి కొత్తకారులో లక్నో నుంచి కాన్పూర్ బయలు దేరాడు. ఈ క్రమంలో మార్గం మధ్యలో కారు ప్రమాదానికి గురైంది. పొగమంచు కారణంగా డివైడర్ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో అపూర్వ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అయితే, ఈ ఘటన తర్వాత జనవరి 29వ తేదీన ఆ కారును మహీంద్రా సర్వీసింగ్ సెంటర్కు తీసుకువెళ్లి అందులో ఉన్న లోపాలను వారికి వివరించాడు. తన కుమారుడు సీట్ బెల్ట్ పెట్టుకున్నప్పటికీ ఎయిర్బ్యాగ్స్ ఓపెన్ కాలేదని.. అసలు ఆ కారులో ఎయిర్ బ్యాగ్స్ లేవని ఆరోపించాడు. కంపెనీ నిర్లక్ష్యం వల్లే తన కుమారుడు మరణించాడంటూ వారిపై మండిపడ్డారు. ఈ మేరకు కంపెనీ తప్పుడు హామీలిచ్చి తనను మోసం చేసిందంటూ ఆనంద్ మహీంద్రా సహా ఆ సంస్థలో పనిచేస్తున్న మరో 12 మంది ఉద్యోగులపై రాజేశ్ మిశ్రా చీటింగ్ కేసు పెట్టాడు. అతడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
FIR registered against Mahindra chairman in Kanpur, UP.
Rajesh Mishra, a UP’s Kanpur resident, gifted Mahindra Scorpio to his son Apoorv Mishra. On 14 January 2022, Apoorv returning to Kanpur from Lucknow in Scorpio met with an accident and died. He was wearing the seat belt… pic.twitter.com/7Pk3q9Mbgr
— Piyush Rai (@Benarasiyaa) September 25, 2023
Also Read..
India-Canada | తీవ్రవాదులకు అడ్డాగా మారిన కెనడా.. భారత్కు మద్దతుగా నిలిచిన శ్రీలంక
Manpreet Singh Badal | ఆస్తి కొనుగోలు కేసులో బీజేపీ నేతకు లుకౌట్ నోటీసులు జారీ
Parineeti-Raghav Chadha | పెళ్లిలో పరిణీతి-రాఘవ్ డ్యాన్స్.. ఫన్నీ వీడియో