Sundar Pichai | ప్రముఖ సెర్చింజన్ గూగుల్ (Google) సీఈవో సుందర్ పిచాయ్ (Sundar Pichai) సంస్థలో చేరి 20 ఏళ్లు పూర్తైంది. ఈ సందర్భంగా గూగుల్తో తనకున్న బంధంపై ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. 2004లో సంస్థలో ప్రాడక్ట్ మేనేజర్గా చేరినప్పటి నుంచి నేటి వరకూ గూగుల్లో తన ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటూ ఇన్స్టాలో పోస్టు షేర్ చేసుకున్నారు. ఉద్యోగంలో చేరిన తొలినాళ్ల నుంచి నేటి వరకు సంస్థలో ఎన్నో మార్పులు జరిగినట్లు చెప్పుకొచ్చారు.
‘2004 ఏప్రిల్ 26న గూగుల్లో నా తొలి రోజు ప్రారంభమైంది. ప్రాడక్ట్ మేనేజర్గా నా ప్రయాణాన్ని ప్రారంభించాను. అప్పటి నుండి ఇప్పటి వరకూ సంస్థలో చాలా మార్పులు జరిగాయి. సాంకేతికత, మా ఉత్పత్తులను ఉపయోగించే ప్రజల సంఖ్య.. ఇలా ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. నా జుట్టు కూడా. కానీ, ఈ గొప్ప సంస్థలో పని చేస్తుంటే నాకు కలిగే ఉత్సాహం మాత్రం మారలేదు. 20 ఏళ్లు గడిచిపోయాయి. ఇందులో భాగమైనందుకు ఇప్పటికీ నన్ను నేను అదృష్టవంతుడిగా భావిస్తున్నాను’ అని సుందర్ పిచాయ్ తన పోస్ట్లో రాసుకొచ్చారు. 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సంస్థ నుంచి తనకు అందిన తీపి గుర్తులను షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది.
ఓ సాధారణ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన సుందర్ పిచాయ్.. 2004లో గూగుల్లోకి అడుగుపెట్టారు. ఓ సాధారణ ఉద్యోగిగా గూగుల్లోకి అడుగుపెట్టిన ఆయన సంస్థ అభివృద్ధికి నిరంతరం కృషి చేశారు. అంచెలంచలుగా ఎదుగుతూ.. సీఈవో పదవికి చేపట్టారు. గూగుల్ క్రోమ్, ఆండ్రాయిడ్, గూగుల్ డ్రైవ్ వంటి గొప్ప గొప్ప ఆవిష్కరణలన్నీ ఆయన ఆలోచనల నుంచి పుట్టకొచ్చినవే. ఆ కష్టానికి ప్రతిఫలంగా 2015లో ఆయనకు సీఈవో పదవి దక్కింది.
Also Read..
Robert Vadra | నేను రాజకీయాల్లోకి రావాలని దేశమంతా కోరుకుంటోంది.. రాబర్ట్ వాద్రా కీలక వ్యాఖ్యలు
Samantha | ఇంత మంది ఫ్యాన్స్ ఉండటం చిన్న విషయం కాదు.. ఆసక్తికర విషయాలు పంచుకున్న సమంత
Miss Universe | అందాల పోటీల్లో 60 ఏళ్ల భామకు కిరీటం.. చరిత్రలో ఇదే తొలిసారి..