Viral News | ఎలుక (Rat)ను చంపినందుకు గానూ ఓ వ్యక్తిపై పోలీసులు 30 పేజీల చార్జిషీట్ (30 page chargesheet) దాఖలు చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
గతేడాది నవంబరులో మనోజ్ కుమార్ (Manoj Kumar) అనే వ్యక్తి ఎలుక తోకకు రాయికట్టి కాలువలోకి విసిరేశాడు. ఇది చూసిన జంతు సంరక్షణ కార్యకర్త (animal rights activist ) వికేంద్ర శర్మ (Vikendra Sharma).. కుమార్పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎలుక పట్ల అతను క్రూరంగా వ్యవహరించాడని ఆరోపించారు. ఎలుకను కాపాడేందుకు ప్రయత్నించానని.. అయితే ఆ ప్రాణి అప్పటికే మృతి చెందినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
వికేంద్ర శర్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కుమార్పై ఐపీసీ సెక్షన్ 429తో పాటు జంతు హింస నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఎలుక కళేబరాన్ని పోస్టుమార్టం నిమిత్తం బరేలీ (Bareilly)లోని ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ( Indian Veterinary Research Institute )కు తీసుకెళ్లారు. అక్కడ ఎలుకను పరీక్షించిన ఫోరెన్సిక్ నిపుణులు.. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ కారణంగా అది చనిపోయినట్లు తేలింది. ఈ క్రమంలోనే నిందితుడు కుమార్పై యూపీ పోలీసులు బదాయూ కోర్టులో 30 పేజీల చార్జిషీట్ దాఖలు చేశారు. ఈ కేసులో కుమార్కు కనీసం మూడేండ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్లు ఓ సీనియర్ న్యాయవాది తెలిపారు.
Also Read..
Keshub Mahindra | వృద్ధ బిలియనీర్ కేషుబ్ మహీంద్రా కన్నుమూత
India Corona | వార్నింగ్ బెల్స్.. ఒక్కరోజులో 7 వేలకు పైనే కొత్త కేసులు