Keshub Mahindra | భారత్లో అత్యంత వృద్ధ బిలియనీర్, మహీంద్రా అండ్ మహీంద్రా ఎమెరిటస్ చైర్మన్ (chairman emeritus of Mahindra & Mahindra) కేషుబ్ మహీంద్రా (Keshub Mahindra) (99) బుధవారం కన్నుమూశారు. ఈ విషయాన్ని మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థల మాజీ ఎండీ పవన్ కె గోయెంకా (Pawan Goenka) తన ట్విటర్ ద్వారా వెల్లడించారు. ‘పారిశ్రామిక ప్రపంచం నేడు అత్యంత ఉన్నతమైన వ్యక్తిని కోల్పోయింది’ అంటూ సంతాపాన్ని ప్రకటించారు. విషయం తెలుసుకున్న పలువురు వ్యాపారవేత్తలు కేషుబ్ మహీంద్రా మృతి పట్ల సంతాపం తెలుపుతున్నారు.
ప్రస్తుతం మహీంద్రా అండ్ మహీంద్రా చైర్మన్ ఆనంద్ మహేంద్ర మేనమామే కేషుబ్ మహీంద్ర. ఆయన అక్టోబర్ 9, 1923లో సిమ్లాలో జన్మించారు. యూఎస్లోని పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 1947లో మహీంద్రా గ్రూప్లో చేరిన కేషుబ్.. 1963లో చైర్మన్గా బాధ్యతలు చేపట్టారు. దాదాపు ఐదు దశాబ్దాలపాటు కంపెనీకి నాయకత్వం వహించిన ఆయన.. ఆగస్టు 2012లో చైర్మన్గా పదవీ విరమణ చేశారు. ఆయన పదవీ విమరణ అనంతరం.. వారసుడిగా మేనల్లుడు ఆనంద్ మహీంద్రా గ్రూపు చైర్మన్గా బాధ్యతలు చేపట్టారు.
అత్యంత వృద్ధ బిలియనీర్..
ఇటీవల ఫోర్బ్స్ విడుదల చేసిన బిలియనీర్ లిస్ట్ 2023లో కేషుబ్ మహీంద్రా చోటు దక్కించుకున్నారు. ఈ లిస్ట్లో భారతదేశంలో అత్యంత వృద్ధ బిలియనీర్గా ఆయన నిలిచారు.
The industrial world has lost one of the tallest personalities today. Shri Keshub Mahindra had no match; the nicest person I had the privilege of knowing. I always looked forward to mtgs with him and inspired by how he connected business, economics and social matters. Om Shanti.
— Pawan K Goenka (@GoenkaPk) April 12, 2023
Also Read..
India Corona | వార్నింగ్ బెల్స్.. ఒక్కరోజులో 7 వేలకు పైనే కొత్త కేసులు
Hyderabad | ఏటీఎం దొంగతనానికి ట్రై.. 5 నిమిషాల్లోనే దొంగలను పట్టేసుకున్న రాచకొండ పోలీసులు