న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్ అత్యాచార కేసులో దోషి అయిన కుల్దీప్ సింగ్ సెంగర్ జైలు శిక్షను ఢిల్లీ హైకోర్టు నిలిపివేసింది. ఈ నేపథ్యంలో అత్యాచార బాధితురాలు, ఆమె తల్లి ఢిల్లీలో నిరసనకు ప్రయత్నించారు. (Unnao Rape Case) అయితే పోలీసులు వారిని అక్కడి నుంచి లాక్కెళ్లారు. బలవంతంగా పోలీస్ వాహనంలోకి ఎక్కించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
కాగా, తమకు న్యాయం జరుగలేదని అత్యాచార బాధితురాలి తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. తనతో పాటు కుమార్తెను సీఆర్పీఎఫ్ వాహనంలో తరలించినట్లు ఆమె తెలిపింది. భద్రతా సిబ్బంది తమను చంపాలనుకుంటున్నారని ఆమె ఆరోపించింది. ‘కుల్దీప్ సెంగర్ బెయిల్ రద్దు చేయాలి. లేకుంటే మా ప్రాణాలను వదులుకుంటాం. మమల్ని చంపుతారు. మేం సురక్షితంగా లేము’ అని మీడియాతో ఆమె అన్నారు.
మరోవైపు ఉన్నావ్ అత్యాచార బాధితురాలు కూడా మీడియాతో మాట్లాడింది. బహిష్కృత బీజేపీ నేత కుల్దీప్ సింగ్ సెంగర్ జైలు శిక్షను ఢిల్లీ హైకోర్టు సస్పెండ్ చేయడంపై ఆమె ఆందోళన వ్యక్తం చేసింది. ఈ తీర్పు తన కుటుంబానికి ‘మరణం’ లాంటిదని పేర్కొంది. ఢిల్లీ హైకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ఆమె తెలిపింది.
#WATCH | Delhi: Police remove 2017 Unnao rape case victim, her mother, and women activist Yogita Bhayana from the protest site near India Gate.
They were holding a protest against the Delhi High Court’s order suspending the sentence of 2017 Unnao rape case accused, Kuldeep… https://t.co/RTtewzObCz pic.twitter.com/Stuv4unBor
— ANI (@ANI) December 23, 2025
Also Read:
Girl Dies oF Dog Bite | కుక్క కరవడంతో చికిత్స పొందిన బాలిక.. నెల తర్వాత మృతి