న్యూఢిల్లీ: దేశంలోని వివిధ హైకోర్టుల్లో న్యాయమూర్తి పదవులు 324 ఖాళీగా ఉన్నట్లు కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ గురువారం రాజ్యసభకు లిఖితపూర్వకంగా తెలిపారు. అన్ని హైకోర్టుల్లో 1,114 మంది న్యాయమూర్తుల నియామకానికి అనుమతి ఉందని, ప్రస్తుతం 790 మంది పని చేస్తున్నారని తెలిపారు.
హైకోర్టు కొలీజియంల నుంచి ఈ ఏడాది జనవరి వరకు 171 ప్రతిపాదనలు వచ్చాయని, ఈ ఏడాది కొత్తగా 121 ప్రతిపాదనలు వచ్చాయని, మొత్తం 292 ప్రతిపాదనల్లో 110 మంది న్యాయమూర్తుల నియామకాలు జరిగాయని చెప్పారు.