Amit Shah | న్యూఢిల్లీ : కేంద్ర హోం మంత్రి అమిత్ షా మంగళవారం త్రుటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. రాజస్థాన్ శాసన సభ ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రచారం చేయడం కోసం ఆయన నాగౌర్లో పర్యటించారు.
ఆయన ప్రయాణిస్తున్న ప్రచార రథం పై భాగం ఓ విద్యుత్తు వైరుకు తగిలింది. వెంటనే నిప్పు రవ్వలు ఎగసిపడి, ఆ వైరు తెగిపోయింది. బిదియాద్ గ్రామం నుంచి పర్బత్సర్కు వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది.