లక్ష్మీదేవి ‘సైకిల్’ లేదా ‘ఏనుగు’పై ఎవరి ఇంటికీ రాదు. తన ‘చెయ్యి’ ఊపుతూ కూడా కనిపించదు. లక్ష్మీదేవి ‘కమలం’పై మాత్రమే వస్తుంది. పేదలకు ఏడాదికి రూ.6 వేలు, ఉచిత రేషన్, అనేక మందికి పక్కా ఇండ్లు ఇచ్చాం. ప్రభుత్వ ఏర్పాటుకే కాదు.. దేశాన్ని, సమాజాన్ని నిర్మించేందుకూ రాజకీయాలు చేస్తాం. అందుకే కఠిన నిర్ణయాలు తీసుకుంటాం. –మంగళవారం యూపీ ప్రచారంలో కేంద్ర మంత్రి రాజ్నాథ్
రాజ్నాథ్కు మరోసారి నిరసన సెగ
బల్లియా: యూపీ ఎన్నికల ప్రచారంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్కు నిరుద్యోగ యువత నుంచి మరోసారి నిరసన సెగ ఎదురైంది. మంగళవారం బల్లియా జిల్లాలోని బన్షి బజార్లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. మూడేండ్లుగా పెండింగ్లో ఉన్న ఆర్మీ రిక్రూట్మెంట్ చేపట్టాలని యువత నినాదాలు చేస్తూ రాజ్నాథ్ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. స్పందించిన రాజ్నాథ్ మాట్లాడుతూ భర్తీ ప్రక్రియ త్వరలో ఉంటుందని వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. మరోవైపు రాజ్నాథ్ ప్రసంగం సమయంలో ఓ వ్యక్తి ఎస్పీ అధినేత అఖిలేశ్కు అనుకూలంగా ‘పేదల పెన్నిది అఖిలేశ్ యాదవ్ జిందాబాద్’ అంటూ నినాదాలు చేశారు. అతన్ని పోలీసులు అరెస్టు చేశారు.