న్యూఢిల్లీ : భారత్లోని ఎర్రకోట సమీపంలో జరిగిన దాడిలో పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ ప్రమేయం ఉన్నదని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి పర్యవేక్షణ బృందం వెల్లడించింది. ఈ మేరకు ఆ బృందం తన 37వ నివేదికను సమర్పించింది.
ఆంక్షల జాబితాలో ఉన్న జైషే బహుళ దాడులకు బాధ్యత వహించినట్టు ఒక సభ్య దేశం తమ పర్యవేక్షణ బృందానికి వెల్లడించినట్టు నివేదిక పేర్కొన్నది. ఎర్రకోటపై దాడితో ఈ సంస్థకు సంబంధం ఉందని ఆ సభ్యదేశం తమకు సూచించినట్టు తెలిపింది.