భోపాల్ : బీజేపీలో అసమ్మతి స్వరాలు పెరుగుతున్నాయి. పార్టీ అధిష్టానం తమను పక్కనపెడుతున్న తీరుపై అగ్ర నేతలు మండిపడుతున్నారు. మధ్యప్రదేశ్లో బీజేపీ మెగా యాత్రకు తనను ఆహ్వానించకపోవడం పట్ల సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం ఉమా భారతి (Uma Bharti) అసంతృప్తి వ్యక్తం చేశారు.
తాను పోస్టర్ గర్ల్లా ఉండదలుచుకోలేదని స్పష్టం చేశారు. తానిప్పటికీ ప్రధాని నరేంద్ర మోదీ కంటే వయసులో చిన్న అని చెబుతూ తాను మరో 15, 20 ఏండ్లు పనిచేయాలని కోరుకుంటున్నానని అన్నారు. పార్టీ యాత్రకు తనను కూడా ఆహ్వానించి ఉండాల్సిందని వ్యాఖ్యానించారు. తాను యాత్రకు హాజరైతే ప్రజల దృష్టి అంతా తనమీదే ఉంటుందని వారు (బీజేపీ నేతలు) భయపడి ఉంటారని ఉమా భారతి పేర్కొన్నారు.
ప్రభుత్వ ఏర్పాటులో (2020లో) వారికి జ్యోతిరాదిత్య సింధియా సాయం చేసిఉండవచ్చని, అయితే తాను 2023లో పార్టీకి భారీ మెజారిటీ సాధించి ప్రభుత్వ ఏర్పాటుకు తాను సహకరిస్తానని ఫైర్బ్రాండ్ నేత స్పష్టం చేశారు. 2024 లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే విషయం ప్రస్తావిస్తూ తాను కొంత విరామం కోరానని, అయితే రానున్న ఎన్నికల్లో పోటీ చేయబోనని ఎన్నడూ చెప్పలేదని చెప్పారు. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ సూచనలకు అనుగుణంగా రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరపున ప్రచారం చేస్తానని ఉమా భారతి పేర్కొన్నారు.
Read More :
IndiGo | ఇండిగో విమానానికి తప్పిన పెను ప్రమాదం.. పక్షి ఢీ కొనడంతో అత్యవసర ల్యాండింగ్